తిరువరూర్ నుండి కరుణానిధి నామినేషన్.. ఆ కోరిక నెవరేరాలని..!

 

త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నామినేషన్ల సందడి నెలకొంది. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆర్కే నగర్ నియోజక వర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. దీనిలో భాగంగానే నామినేషన్ కూడా దాఖలు చేశారు. తాజాగా డీఎంకే అధినేత కరుణానిధి కూడా తిరువరూర్ నియోజక వర్గం నుండి నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఇప్పటికే ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఎన్నోసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కరుణానిధి ఈసారి ఎన్నికల్లో కూడా తన పార్టీని విజయ తీరాలకు చేర్చి.... దేశంలోనే అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి నేతగా రికార్డు నెలకొల్పాలని చూస్తున్నారు. మరి ఈసారి ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందో.. కరుణానిధి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu