వైసీపీ నుండి మరో ఎమ్మెల్యే.. కార్యకర్తల ఒత్తిడి మేరకే

 

వైసీపీ పార్టీ నుండి మరో ఎమ్మెల్యే టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు.  అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సర్వేశ్వరరావు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. సర్వేశ్వరరావు పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలకు స్పందించి... తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం ఉందని.. కార్యకర్తల ఒత్తిడి మేరకే వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నానని ఆయన ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే తాను అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నానని తెలిపారు. ఈ నెల 28న టీడీపీలో చేరుతున్నానని ఆయన పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu