లక్కుండిలో లంకె బిందెలు...నిధి కోసం ప్రభుత్వ వేట

 

కర్ణాటకలోని గడగ్ జిల్లాలో ఉన్న చారిత్రాత్మక లక్కుండి గ్రామంలో ఇంటి నిర్మాణ సమయంలో ఇటీవల లంకె బిందె బయటపడిన విషయం తెలిసిందే. 634 గ్రాముల బరువున్న ఆ తామరపు బిందెలో 466 గ్రామలు బంగారు గాజులు, కడియాలు, గొలుసు, ఉంగరాలు బయటపడ్డాయి. దాంతో ఆ ప్రాంతంలో నిధి కోసం పూర్తిస్థాయిలో తవ్వకాలు చేపట్టాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. శుక్రవారం (16-1-26) నుంచి లక్కుండిలో నిధి కోసం వేట మొదలుపెట్టారు. 

అక్కడి కోటే వీరభద్రేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిధుల కోసం పుర్తిస్థాయి తవ్వకాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. అందుకోసం పెద్ద మొత్తంలో జేసీబీలు, ట్రాక్కులు, ట్రాక్టర్‌లను తరలించారు. ఈ ప్రాజెక్టును పర్యాటక శాఖ, పురావస్తు శాఖ, లక్కుండి హెరిటేజ్ డెవలప్‌మెంట్ అథారిటీ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా చేపడుతున్నాయి. 

పురాతన కాలంలో లక్కుండిలో బంగారు నాణాలు ముద్రించినట్లు అధారాలున్నాయని పురావస్తు శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాంతం 14వ శతాబ్దంలో ప్రధాన నగరంలో ఉండేదని చారిత్రక ఆధారులున్నాయి. భుగర్భంలో ఇప్పటికీ అపారమైన సంపద దాడి ఉండొచ్చని, వాటిని గుర్తించడానికే తవ్వకాలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం లక్కుండిలో లభ్యమైన ఆభరణాలు 400 ఏళ్ల నాటివి అయ్యుండొచ్చని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu