ఏపీకి మరో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు : మంత్రి లోకేశ్

 

ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి రానుందని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎనర్జీ ప్రాజెక్ట్ కాకినాడలో ఏర్పాటు కానుందని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పెట్టుబడుల వివరాలను వెల్లడించారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో 8 వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ఏడాదికి 1.5 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయ్యే గ్రీన్ ఎనర్జీని కాకినాడ నుంచి జర్మనీ, సింగపూర్‌  సరఫరా చేయనున్నట్లు  లోకేశ్ తెలిపారు. 2030 నాటికి ఏఎం గ్రీన్‌ కంపెనీ ఉత్పత్తి ప్రారంభిస్తుందని మంత్రి తెలిపారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu