కలెక్టరేట్లను ముట్టడించిన ఎబివిపి ఉద్రిక్తత

కరీంనగర్: ఫీజు రీయింబర్సుమెంట్స్, స్కాలర్ షిప్స్ కోసం కలెక్టరేట్లను ముట్టడించిన అఖిల భారత విద్యార్థి పరిషత్(ఎబివిపి) విద్యార్థులపై పోలీసులు గురువారం లాఠీఛార్జ్ చేశారు. రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో ఎబివిపి విద్యార్థులు ఫీజు రీయింబర్సుమెంట్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్లను ముట్టడించారు. లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులపై లాఠీఛార్జికి నిరసనగా కరీంనగర్‌లో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu