ప్రతిపక్షాలపై కడియం ఫైర్.. అప్పుడు తేలిపోతుంది


తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై విరుచుకుపడ్డారు. రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు అధికార పార్టీపై చేస్తున్న విమర్శలకు.. రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాజకీయం చేస్తుందని.. కాంగ్రెస్ పార్టీ 42 ఏళ్లు పాలించింది.. అప్పుడు రైతులకు ఏం చేసింది.. అసలు వారి వల్లే ఇప్పుడు రైతులు ఇన్ని సమస్యలు పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి, దోపిడీని చూసి ప్రజలు ఆపార్టీని కనుమరుగు చేశారని అన్నారు. అంతేకాదు వరంగల్ ఎన్ కౌంటర్ పై అనవసర రాద్దాంతం చేస్తున్నారు.. కాంగ్రెస్ హయాంలో ఎంతమందిని ఎన్ కౌంటర్ చేయలేదు అని ప్రశ్నించారు. వాటర్ గ్రిడ్ పై కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుందని.. ఈ ఆరోపణలు అర్ధరహితమని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని.. ప్రజాదరణ ఏ పార్టీకి ఉందో వరంగల్ ఉప ఎన్నికలో తేలిపోతుందని మంత్రి కడియం శ్రీహరి అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu