రోడ్డు మార్గంలో వస్తా.. వద్దు వద్దు హెలికాఫ్టర్లో రా.. చంద్రబాబు


ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించి కేసీఆర్ కూడా శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని చెప్పారు. దీనికి సంబంధించి కేసీఆర్ ఎలా వెళ్లాలో రూట్ మ్యాప్ కూడా తెలుసుకున్నారట. దీనిలో భాగంగానే తాను సూర్యాపేట నుండి రోడ్డు మార్గంలో అమరావతికి వస్తానని చంద్రబాబుకు చెబితే.. దీనికి చంద్రబాబు రోడ్డు మార్గంలో వద్దు.. హెలికాప్టర్ లో వస్తే బావుంటుందని సూచించే సరికి కేసీఆర్ కూడా అందుకు అంగీకరించారట. కాగా కేసీఆర్ రేపు సాయంత్రం సూర్యాపేట వెళ్లి అక్కడే ఉండి ఎల్లుండి ఉదయం 10.30 గంటలకు హెలికాఫ్టర్ లో శంకుస్థాపన కార్యక్రమానికి వెళతారు. అనంతరం  2.30 గంటలకు తిరిగి మళ్లీ సూర్యపేట చేరుకొని అక్కడి అభివృద్ది కార్యక్రమాలు చూసుకొని ఆ తరువాత హైదరాబాద్ కు వస్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu