కాబుల్ లో మళ్లీ పేలుళ్లు... 18 మంది మృతి..

 

రెండు రోజుల క్రితమే కాబుల్ లో ఉగ్రవాదులు దాడి జరపగా.. చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి పేలుళ్లు సంభవించాయి. కాబూల్‌లోని ఖైర్‌ ఖానా శ్మశానవాటిక వద్ద మూడు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 18 మంది మరణించగా... అనేకమంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సెనేటర్‌ ఎజాదియార్‌ కుమారుడి అంత్య క్రియల సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu