జయలలిత ఖైదీ నంబర్ 7402

 

ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు బెంగళూరు ప్రత్యేక కోర్టు కేవలం నాలుగేళ్ళ జైలు శిక్షతో సరిపెట్టకుండా ఈ కేసులో నిందితులైన నలుగురికీ ఒక్కొక్కరికి పాతిక కోట్ల రూపాయల చొప్పున మొత్తం వంద కోట్ల జరిమానా విధించింది. ఈ కేసులో జయలలితతోపాటు ఆమె స్నేహితురాలు శశికళ, దత్తపుత్రుడు సుధాకరన్, ఇళవరసి వున్నారు.
జయలలితకు జైల్లో ఖైదీ నంబర్ 7402 కేటాయించారు. ఆమె ఆహారం తీసుకోలేదని తెలుస్తోంది.