బెయిలు కోసం సుప్రీం కోర్టుకు జయలలిత

 

కర్నాటక హైకోర్టు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నట్టు తెలుస్తోంది. జయలలిత తరపున ఆమె లాయర్లు బుధవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటీషన్ను దాఖలు చేయనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష పడిన జయకు కర్ణాటక హైకోర్టులో మంగళవారం నాడు బెయిలు రాలేదు. బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరుతూ జయ దాఖలు చేసిన పిటీషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో జయలలితకు ఇప్పుడు సుప్రీంకోర్టు మాత్రమే దిక్కయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu