జగన్మోహన్ రెడ్డిపై రావెల తీవ్ర ఆరోపణలు

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గుంటూరులో దీక్ష చేపట్టడాన్ని మంత్రి రావెల ఎద్దేవా చేశారు, జగన్ కు నిజంగా దమ్ముంటే... దీక్ష గుంటూరులో కాదు ఢిల్లీలో చేయాలని సవాలు విసిరారు, దొంగ దీక్షలు చేసే జగన్మోహన్ రెడ్డి... గుంటూరులో అలజడి సృష్టించాలని చూస్తున్నారని మంత్రి ఆరోపించారు. అమరావతి శంకుస్థాపనకు దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులను అడ్డుకోవాలని జగన్ చూస్తున్నారని, జగన్ ప్రవర్తనను చూసి ఆ పార్టీ నేతలే అసహ్యించుకుంటున్నారని రావెల విమర్శించారు, నవ్యాంధ్రప్రదేశ్ ను పునాదుల నుంచి పునర్ నిర్మించడానికి చంద్రబాబు రాత్రీపగలూ కష్టపడుతుంటే, జగన్ అడ్డుపుల్లలు వేస్తూ అభివృద్ధి నిరోధక దీక్ష చేస్తున్నారని విమర్శించారు.