రెండోరోజుకి చేరిన జగన్ ప్రత్యేక దీక్ష

విభజన హామీల మేరకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి... గుంటూరులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండోరోజుకి చేరింది, స్పెషల్ స్టేటస్ పైనే నవ్యాంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు ఆధారపడి ఉందని, అందుకోసం ఎంతకైనా తెగించి పోరాడదామని జగన్ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వస్తేనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ఆయన, ప్రతి పనికీ కేంద్రం నుంచి 90 శాతం గ్రాంటు, పది శాతం లోను వస్తాయన్నారు. స్టేటస్ లభిస్తే పరిశ్రమలకు పన్ను, ఎక్సైజ్‌ డ్యూటీలకు మినహాయింపు ఉంటుందని, అంతేకాకుండా ఇరవై ఏళ్లపాటు విద్యుత్‌ చార్జీలు సగం ధరే చెల్లించవచ్చన్నారు.దాంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు,  ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు ప్రత్యేక హోదాపై నోరు విప్పకపోవడం దౌర్భాగ్యమంటూ జగన్ వ్యాఖ్యానించారు.