ఐటీ సీఇఓల సదస్సులో పలు ఒప్పందాలు

 

విశాఖపట్టణంలో జరుగుతున్న ఐటీ కంపెనీల సీఇఓల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వానికి - విప్రో, టెక్ మహీంద్రా, సమీర్ తదితర సంస్థలతో కీలకమైన ఒప్పందాలు జరిగాయి. 400 కంపెనీల నుంచి ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు బాలకృష్ణన్ హాజరయ్యారు. మధురవాడ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ అభివృద్ధికి అవగాహన ఒప్పందం, మధురవాడ ఐటీ సెంటర్ అభివృద్ధికి మాబ్ ఎంఈ / స్టార్ట్ అప్ విలేజ్‌తోతో ఒప్పందం, చిరు వ్యాపారులు, మహిళలు ఇంటర్నెట్ ద్వారా లబ్ధి పొందేందుకు వీలుగా గూగుల్ సాయం, డిజిటల్ ఎ.పి. ప్రాజెక్టులో భాగంగా గూగుల్ ఇండియాతో అవగాహన ఒప్పందం వంటి ఒప్పందాలు ఈ సదస్సులో జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ఐటీ సలహాదారు సత్యనారాయణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే శక్తి చంద్రబాబుకు ఉందని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu