రోడ్డు ప్రమాదం: పదిమంది మృతి

 

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ - ఇచ్ఛాపూర్ ప్రధాన రహదారి మీద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా పదిమంది మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో వున్న వీరి వాహనాన్ని ఉజ్జయిని నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ట్రక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరణించినవారు ఖార్గోన్ జిల్లా కేదలజాగీర్ అనే గ్రామానాకి చెందినవారని తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu