మన సినిమాల్ని ప్రొత్సహించేందుకు..

భారతీయ చిత్రాల నిర్మాతలకు చేయూత నిచ్చే ఒక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. వారికోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. దీనిలో భాగంగానే.. ఇకపై ఆస్కార్, కేన్స్ వంటి చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడే చిత్రాలకు ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈసందర్బంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రాజ్య వర్ధన్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. ఆస్కార్ కు ఎంపికయ్యే చిత్రానికి రూ.కోటి, కేన్స్ కు అయితే రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలని భావిస్తున్నట్లు  తెలిపారు. భారత్ లో షూటింగ్ నిమిత్తం వచ్చే విదేశీ ఫిల్మ్ మేకర్లకు వీసా వెసులుబాటు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu