సెటిలర్లపై ఒక్క దాడైనా జరిగిందా? కేటీఆర్ సవాల్
posted on Oct 6, 2015 12:09PM

హైదరాబాద్ లో సీమాంధ్రుల ఓట్లు తొలగిస్తున్నామంటూ విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ ఐటీశాఖా మంత్రి కేటీఆర్ అన్నారు, తెలంగాణ వస్తే సీమాంధ్రులను గెంటేస్తామంటూ గతంలో ఇలానే ప్రచారం చేశారని, ఇప్పటివరకూ ఒక్క సంఘటన అయినా అలాంటి జరిగిందా అంటూ ప్రశ్నించారు, ఓట్లు తొలగింపుపై ప్రతిపక్షాల ఆరోపణలు అర్ధరహితమన్న కేటీఆర్... గతంలో కంటే హైదరాబాద్ లో ఓట్లు పెరిగాయన్న సంగతి తెలుసుకోవాలన్నారు, హైదరాబాద్ లోని సీమాంధ్రులకు ఎలాంటి హానీ జరగదన్న సీఎం కేసీఆర్ తన హామీని నిలబెట్టుకున్నారని, ఏడాదిన్నర పాలనలో సెటిలర్లపై ఒక్క దాడి కూడా జరగలేదన్నారు. దేశంలో ఎక్కడి నుంచి వచ్చినవారైనా ప్రశాంతంగా బతికే వాతావరణం హైదరాబాద్లో ఉందన్నారు.