ఏపీ, తెలంగాణపై కేంద్రానికి గవర్నర్ రిపోర్ట్!

ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ నర్సింహన్ ...వరుస భేటీలతో బిజీబిజీగా గడుపుతున్నారు, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమైన నర్సింహన్... తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితిపై రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది, మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలవనున్న గవర్నర్...తన దగ్గరున్న సమాచారాన్ని అందజేయనున్నారు. తెలంగాణ మంత్రి తలసాని వ్యవహారం రాజ్ నాథ్ తో భేటీ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది, తలసాని పార్టీ ఫిరాయింపుపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్న నర్సింహన్....దానిపై నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం తన పరిధిలో లేదన్నారు, పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలన్నారు, తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయన్న గవర్నర్.... ఏపీ రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానిస్తే వెళ్తానని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu