సినీ ఫక్కీలో భారీ స్కాం.. దళితులు, గిరిజనుల పేర్లతో రుణాలు

నెల్లూరు జిల్లాలో సినీ ఫక్కీలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. నెల్లూరు, ముత్తుకూరు యాక్సిక్ బ్యాంకు బ్రాంచీల్లో నిరుపేద దళితులు, గిరిజనుల పేర్లతో రుణాలు తీసుకుని కుబేరా సినిమా తరహాలో ఘరానా మోసానికి కొంతమంది వ్యక్తులు పాల్పడ్డారు. ఇటీవల శేఖర కమ్ముల డైరక్షన్‌లో నాగార్జున, ధనుష్ ప్రధానపాత్రల్లో పాన్ ఇండియా మూవీగా కుబేరా విడుదలైంది.   బిక్షగాళ్లని విదేశాలకు తీసుకెళ్లి పెద్దపెద్ద కంపెనీల యజమానులుగా మార్చేసి, వారి అకౌంట్ల ద్వారా లక్షల కోట్ల రూపాయలని బదిలీ చేయడం..   కుబేర సినిమా స్టోరీ. ఈ మూవీ రిలీజ్‌కు ముందే నెల్లూరు జిల్లాలో ఆ తరహా స్కాం చేసి చూపించారు క్రమినల్స్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకి లోన్స్ ఇస్తామని చెప్పి వారి ఆధార్ కార్డులు సేకరించారు. వారిని అలా ఆధార్ కార్డులు సేకరించి ఆ గిరిజనులను సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా చూపించి.. వారి పేరు మీద రుణాలు తీసుకుని బోగస్ కంపెనీలు క్రియేట్ చేసి.. గిరిజనులను ఉద్యోగులుగా చూపి.. కోట్లకు కోట్లు రుణాలు మంజూరు చేయించుకున్నారు. నెల్లూరుకి చెందిన ఐదుగురు ఈ స్కామ్ చేశారు.  ఇందులో బ్యాంకు ఉద్యోగుల పాత్ర కూడా వుండటం గమనార్హం. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి 8 నెలలు గడుస్తున్నా.. విచారణ ముందుకు కదల్లేదు.

 తెలుగు రాష్టాలతో పాటు చెన్నై లో కూడా ఈ స్కామ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాసుదేవ నాయుడు, అల్లాబక్షు, శివ, వెంకట్‌తో పాటు మరికొందరి పాత్ర ఉందని గిరిజన సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. యాక్సిస్ బ్యాంకు లో జరిగిన స్కామ్ పై సీఐడీ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు, ముత్తుకూరు యాక్సిక్ బ్యాంకు బ్రాంచీల్లో నిరుపేద దళితులు, గిరిజనుల పేర్లతో రుణాలు తీసుకుని భారీ స్కాంకు పాల్పడ్డారు.  రూ.15కోట్ల నుంచి రూ.20కోట్ల మేర అమాయకులకి టోకరా వేశారు.  

రుణాలు చెల్లించాల్సిందిగా బ్యాంకుల నుంచి పేదలకి నోటీసులు రావడంతో ఈ బాగోతం బయటపడింది. ఈ మాఫియా కాజేసిన సొమ్ముతో సినిమాలు తీశారు. గతంలోనూ జర్నలిస్టు యూనియన్ పేరుతోనూ జాలే వాసుదేవనాయుడు భారీ మొత్తాలు వసూలు చేశాడు . గిరిజనుల పేరుతో స్కాంపై ఏడు నెలల క్రితం నెల్లూరు పోలీసులకి ఫిర్యాదులు చేసి గోప్యంగా ఉంచారు బ్యాంకు అధికారులు.  2021 నుంచి 2024 మధ్య ఈ వ్యవహారం భారీఎత్తున   జరిగినట్లు తెలుస్తోంది‌.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu