ఇప్పడే విభజనపై జోక్యం చేసుకోలేం ; హైకోర్ట్‌

 

రాష్ట్ర విభజన అంశంపై హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యన్ని కోర్టు కొట్టివేసింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక మీద పార్లమెంట్‌లో చర్చకు ఆదేశించాలని  కోరుతూ దాఖలైన పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ కళ్యాన్‌ జ్యోతి సేన్‌ గుప్తా, జస్టిస్‌ పివి సంజయ్‌కుమార్‌లు కొట్టేశారు. నివేదిక పూర్తి స్థాయిలో లేదని పూర్తి వివరాలతో మరోసారి పిల్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించినా, పిటీషర్‌ తరుపున న్యాయవాది వాదనలను కొనసాగించారు.అనంతరం విభజనకు సంబంధించి ప్రస్తుత దశలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేస్తూ, నిరర్థక వాదనలతో విలువైన కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు పిటిషనర్‌కు రూ.5 వేల జరిమానా విధించారు.