హరికృష్ణ యాత్రకు పుల్ స్టాప్..!

 

 Harikrishna plans Chaitanya Yatra, Chaitanya Yatra Harikrishna

 

 

రాష్ట్ర విభజనను నిరసిస్తూ తెలుగువారంతా కలిసి ఉండాలని, తెలుగు జాతి ఒక్కటేనని డిమాండ్ చేస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నందమూరి హరికృష్ణ త్వరలోనే చైతన్య యాత్ర చేపట్టనున్నారని వార్తలు వచ్చాయి. మొదట హిందూపురం నుండి అని తరువాత ఆయన తన సొంత ఊరు కృష్ణా జిల్లా నిమ్మకూరు నుండి యాత్ర మొదలు పెట్టనున్నారని అన్నారు. అయితే ప్రస్తుతం ఆయన యాత్ర ఏమీ లేదని తెలుస్తోంది.

 

సమైక్యవాదనతో తెలుగుదేశం పార్టీ నేతగా, ఎన్టీఆర్ కుమారుడిగా సీమాంధ్రలోని తెలుగు తమ్ముళ్లు తన రాజీనామాతో తన వెనక వస్తారని, బావ చంద్రబాబు విభజన గురించి పెద్దగా మాట్లాడనందున సమైక్యవాదనతో తను హీరో అయిపోతానని హరికృష్ణ అనుకున్నా తెలుగుతమ్ముళ్లు ఎవరూ హరికృష్ణ వైపు వచ్చేందుకు సిద్దపడలేదట. కనీసం ఆయనకు నైతిక మద్దతు కూడా తెలిపిన వారు ఎవరూ లేకపోవడంతో సీతయ్య కంగు తిన్నాడట. దీంతో తన యాత్రకు హరికృష్ణ పుల్ స్టాప్ పెట్టాడట.