ఎన్నిసార్లు శీలపరీక్ష చేసుకోవాలి?

 

 

 

తాను, తన కొడుకు ఎన్నిసార్లు శీలపరీక్ష చేసుకోవాలని టిడిపి నాయకుడు హరికృష్ణ ప్రశ్నించారు. నాడు ఎన్టీఆర్ బాలయ్య పెళ్లికి రాకపోవడాన్ని ఏమంటారని, తాను తెలుగు జాతి కోసం పోరాడుతున్నందునే బాలకృష్ణ కూతురు పెళ్లికి రాలేదని చెప్పారు. బంధుత్వం కంటే తెలుగు జాతి ముఖ్యమనే విషయాన్ని గుర్తించాలన్నారు.


హరికృష్ణ తన సోదరి పురందేశ్వరి డైరెక్షన్లో టిడిపికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. పీఏసీ చైర్మన్ పదివి కోసం టిడిపిని బ్లాకు మెయిల్ చేసిన వారే తనను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 

      

ఈ రోజు హరికృష్ణ పుట్టిన రోజు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలుగు జాతి ముక్కలు అవుతుంటే తాను పుట్టిన రోజు వేడుకలను జరుపుకోలేనన్నారు. తెరాసతో పొత్తు ముప్పు అని తాను అప్పుడే చెప్పానన్నారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే హైదరాబాదు పరిసరాల్లో 20, సీమాంధ్రలో 40 సీట్లు ఓడుతామని ముందే చెప్పానన్నారు. తాను ఆనాటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదన్నారు.