అమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి
posted on Jul 29, 2025 12:44PM

అగ్రరాజ్యం అమెరికాలో మరో సారి కాల్పుల కలకలం రేగింది. న్యూయార్క్ లో జరిగిన ఈ కాల్పుల ఘటనలో ఓ పోలీసు అధికారి సహా ఐదుగురు మృత్యువాత పడ్డారు. న్యూయార్క్ లోని మన్ హట్టన్ లో ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. మన్ హటల్ లో అత్యంత రద్దీగా వ్యాపార సముదాయం వద్ద ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది.
ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు సంఘటనా స్థలం వద్ద పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. కాల్పులకు తెగబడిన దుండగుడు అక్కడ నుంచి పరారైపోయారు. ఈ ఘటనలో మరణించిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధనం చేసి సమీప ప్రాంతాలలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకూ కాల్పులకు మోటివ్ ఏమిటి అన్నది తెలియరాలేదు.