గుజరాత్ అప్‌డేట్స్: బీజేపీ ఆధిక్యం 100

 

గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు సంబంధించి ఇవాళ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో చెప్పినట్లుగానే బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కమలం 100 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఉహించని రీతిలో గట్టిపోటి ఇస్తోంది. ఆ పార్టీ 76 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 3 స్ధానాల్లో ముందంజలో ఉన్నారు. 182 స్ధానాలున్న గుజరాత్ అసెంబ్లీలో అధికారం అందుకోవడానికి కావాల్సిన మెజారిటీ సంఖ్య 92.