హిమాచల్‌లోనూ బీజేపీ దూకుడు.. కానీ

 

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు సంబంధించి ఇవాళ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటి వరకు బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగడంతో.. వార్ వన్‌ సైడే అనుకున్నారు. కానీ ఆ తర్వాత అనుహ్యంగా కాంగ్రెస్ పుంజుకుని కొన్ని చోట్ల గట్టి పోటీని ఇచ్చింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ 38 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 18 స్థానాల్లోనూ, ఇతరులు 5 స్థానాల్లోనూ ముందంజలో ఉన్నారు. 68 స్థానాలున్న హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 35 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంది.