జీవోఎం చివరి భేటీ నేడే!

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో రాష్ట్రనాయకులు అభిప్రాయలను సేకరిస్తున్న కేంద్ర మంత్రులు సోమవారం రాష్ట్రనికి చెందిన నాయకులతో చివరి సారిగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనటానికి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కూడా సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. కిరణ్‌తొ పాటు మంత్రి పితాని సత్యనారాయన, గంట శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి, శైలజ్‌నాధ్ టీజీ వెంకటేష్‌లు జీవోయంతో సమావేశం కానున్నారు.

 

అయితే సీమాంద్ర నాయకుల కన్నా గంట ముందుగానే తెలంగాణ నాయకులు తమ వాదనను జీవోయంకు వినిపించనున్నారు. తెలంగాణ ప్రాంతం తరుపున జైపాల్‌ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్‌ జీవోయంతో సమావేశం అవుతారు. ఈ భేటిల తరువాత సీమాంద్ర పాంత్రానికి చెందిన కేంద్ర మంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావు, పళ్లంరాజు, పురందేశ్వరి, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిల్లి కృపారాణి జీవోఎంను కలిసి తమ తమ ప్రాంతాల డిమాండ్లను వినిపించనున్నారు.