కిరణ్‌ పై కంప్లయింట్‌

 

పదవిలో కొనసాగుతూనే సమైఖ్యగానం వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిపై తెలంగాణ నాయకులు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే పలువురు నాయకులు సియం వైఖరిపై బహిరంగంగానే విమర్శలు చేస్తుండగా మరి కొందరు నాయకులు ఇప్పుడ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు.

 

జీవోయంకు తెలంగాణ నేతలు తుది నివేదిక ఇవ్వనున్న నేపధ్యంలో టి కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీలో మకాం వేసి చర్చలు జరుపుతున్నారు. కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి సారధ్యంలో ఇప్పటికే రెండు సార్లు సమావేశం అయ్యారు. ఈ సమావేశాల్లో కిరణ్‌ వైఖరిపై చర్చించినట్టుగా సమాచారం. కిరణ్‌ పట్ల పార్టీ హైకమాండ్‌ ఇంకా ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తే అది చివరకు పార్టీకే నష్టంచేకూర్చుతుందని, ఇదే విషయాన్నిపార్టీ అధినేత్రి సోనియాగాంధీకి చెప్పాలని ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.