పోయింది 1485లో.. అంత్యక్రియలు 2015లో....

 

1485 సంవత్సరంలో చనిపోయిన ఒక రాజుగారికి 2015లో అంత్యక్రియలు జరిగాయి. అది కూడా బోలెడంతమంది అశ్రు నయనాల మధ్య. ఇంగ్లండ్‌లోని లైన్‌స్టర్‌లో 15వ శతాబ్దంలో మరణించిన రాజు రిచర్డ్-3కి ఆదివారం నాడు అంత్యక్రియలు జరిగాయి. క్రీస్తుశకం 1485లో యార్క్ వంశస్థుడైన రిచర్డ్-3కి, ట్యూటర్ అనే రాజుకి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రిచర్డ్-3 మరణించాడు. అయితే ఆయనను ఆ సమయంలో ఎక్కడ ఖననం చేశారన్నది మిస్టరీగా మిగిలిపోయింది. 2012లో పురావస్తు శాస్త్రవేత్తలు రిచర్డ్-3 అవశేషాలను కనుగొన్నారు. డీఎన్ఎ పరీక్షల ద్వారా ఆయన అవశేషాలను గుర్తించారు. దీంతో ఆయన అస్థికలకు తిరిగి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది కన్నీరు కూడా పెట్టుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu