నడిరోడ్డుపై లారీలో మంటలు.. పేలిన గ్యాస్ సిలెండర్లు

మంగళగిరిలో పట్టపగలు నడిరోడ్డుపై ఒక లారీ దగ్ధమై అందులో ఉన్న గ్యాస్ సిలెండర్లు పేలిన ఘటన స్థానికంగా ప్రజలలో తీవ్ర భయాందోళనలు కలిగించింది. ఈ ఘటన మంగళగిరి ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం (ఆగస్టు 6) చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీలో హఠాత్తుగా మంటలు వ్యాపించాయి.

ఆ లారీలో ఉన్న మూడు గ్యాస్ సిలెండర్లు భారీ శబ్డంతో పేలిపోయాయి. లారీ చూస్తుండగానూ పూర్తిగా దగ్ధమైంది. లారీ దగ్ధం కావడం, ఆ లారీలోని గ్యాస్ సిలెండర్లు పెద్ద శబ్బంతో పేలిపోవడంపై ఆ ప్రాంత ప్రజలు, జాతీయ రహదారిపై వెడుతున్న వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అదృష్ట వశాత్తూ ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు.   సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu