ఎఫ్.డి.ఐ.లతో ముప్పు తప్పదా ?
posted on Jul 25, 2012 4:35PM
ప్రధాన మంత్రే ప్రస్తుతం ఆర్ధిక మంత్రిగా కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే దేశంలో ఆర్ధిక మాంధ్యాన్ని అరికట్టటంలో భాగంగా అటకెక్కించిన ఎఫ్ డి ఐ ని ముందుకు తెస్తున్నారు. ఇదివరలో యుపిఎ భాగస్వాములు దీనిని వ్యతిరేకించడం తెలిసిందే. ప్రస్తుతం ములాయంసింగ్ కుమారుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన అఖిలేష్ యాదవ్ కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఎఫ్డిఐకి వ్యతిరేకంగా రిటైల్రంగం లోనికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించకూడదని వచ్చేనెల 9న, వర్తకులంతా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయనున్నారని ఆలిండియా ట్రేడర్స్ అసోసియేషన్ తెలిపింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులవల్ల దేశవాళీ సంస్థలు మూతపడతాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మల్టీఫుల్ బ్రాండ్ రిటైల్ రంగంలోనికి 51 శాతం విదేశీ కంపెనీలకు ఇవ్వటం ద్వారా చిన్న చిన్న వ్యాపారాలకు విఘాతం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి 14 ఎఫ్డిఐల ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంట్లో హైదరాబాద్కు చెందిన తక్షశిలటెక్పార్కు అండ్ ఇన్క్యుబేటర్స్లో 125 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మిగతా 15 ఎఫ్డిఐలకు కేంద్రం అనుమతులు లభించలేదు.