ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు‌కి షాక్..

చేతులదాకా వచ్చిన విజయాన్ని నిలుపుకోలేక చతికిలబడిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు మరో షాక్ తగిలింది. కటక్‌లో జరిగిన రెండో వన్డే‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి శిక్షగా ఇంగ్లాండ్ మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. అంతేకాకుండా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మ్యాచ్ ఫీజులో సైతం 20 శాతం కోత విధించింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు వికెట్ల నష్టానికి 381 పరుగులు చేయగా..అనంతరం చేజింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ తీవ్రంగా పోరాడినప్పటికి నిర్ణీత 50 ఓవర్లలో 366 పరుగులు మాత్రమే చేసి సీరిస్‌ని కోల్పోయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu