అఖిలప్రియపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తల అరెస్ట్

ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై దాడి చేసిన ఘటనలో ఎనిమిది మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వెళ్తుండగా మందడం వద్ద ఆమె కారును వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డగించి..దాడికి యత్నించారు. కారు డోర్లను పగులకొట్టేందుకు ప్రయత్నించడంతో ఆమె గన్‌మెన్లు కాల్పులు జరుపుతామని హెచ్చరించడంతో కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న గుంటూరు రూరల్ ఎస్పీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి దాడికి యత్నించిన వారిని అరెస్ట్ చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu