పేట్ బషీర్ బాద్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్ 

మాదకద్రవ్యాలకు తెలంగాణ రాజధాని అడ్డాగా మారింది. గోవా నుంచి  మత్తు పదార్థాలను  తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ఎండిఎంఏ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.  కారులో హైదరాబాద్  పేట్ బషీర్బాద్ కు కు తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఇటీవల డ్రగ్స్  కు అలవాటు పడ్డ వారు ఎక్కువయ్యారు. యువత టార్గెట్ గా డ్రగ్స్ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఉన్న పాన్ షాప్ లలో మత్తు పదార్థాలు లభ్యమవుతున్నాయి. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. డ్రగ్స్ నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డిప్రెషన్ కు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu