జగన్ ఆలోచించి మాట్లాడితే మంచిది.. డొక్కా

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తాను కనుక అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్యపానం నిషేదం విధిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు అందరూ విమర్శల బాణాలు వదులుతున్నారు. ఇప్పటికే చాలామంది సొంత పార్టీలోకి లిక్కర్ బిజినెస్ చేసే వాళ్లను పెట్టుకొని జగన్ ఇలా వ్యాఖ్యానించడం చాలా హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. ఇప్పుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా జగన్ పై మండిపడ్డారు. ఏపీ లో మద్యం నిషేదిస్తానని జగన్ మాట్లాడిన మాటలు అవగాహన లేకుండా మాట్లాడినట్టు ఉందని అన్నారు. గతంలో మద్యం నిషేదిస్తే ఎలాంటి పరిణామాలు జరిగాయో అవన్నీ తెలుసుకొని మాట్లాడాలని.. ఏపీలో మద్యపాన నిషేదం అంతా ఈజీ కాదని అన్నారు. అందునా దొంగ చాటుగా మందు సరఫరా చేసే ముఠాలు పెరిగిపోయాయి.. జనాలు కూడా నిషేదం విధించారు కదా అని తాగకుండా మానుకోవడంలేదు.. వంద కిలోమీటర్లు దూరం ఉన్నా వెళ్లి మరీ తాగి వస్తారని ఎద్దేవ చేశారు. జగన్ అన్నీ తెలుసుకొని మాట్లాడితే మంచిదని.. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మంచిది కాదని విమర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu