వాక్సిన్ బ్లాక్ దందా.. డోసుకు రూ. 600 

దేశం అంత కరోనా వాక్సిన్ లేక జనాలు అవస్థలు పడుతూ. ఎలాగైనా  తమ ప్రాణాలు కాపాడుకోవాలని ఆసుపత్రుల ముందు పడిగాపులు కాస్తున్నారు. వాక్సిన్ లేదని రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు ఎత్తేశాయి.. మరో వైపు కేంద్ర ప్రభుత్వం వాక్సిన్ సరఫరా చేయలేదని చెపుతున్నాయి. కొంత మంది వ్యక్తులు వాక్సిన్ తో ప్రజల ప్రాణాలతో బ్లాక్ దందా  చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా విజయవాడలో ఓ ప్రైవేట్ వైద్యుడు వాక్సిన్ వేస్తూ. ఒక వ్యాక్సిన్ డోస్ కు రూ .600 అంటూ కారులోనే చికారు చేస్తే టీకాలు వేస్తున్నాడు.  

కొవిడ్ టీకాల కొరతను అడ్డగోలుగా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించాడో వైద్యుడు. ఒక్కో డోసుకు ధరను నిర్ణయించి కారులోనే దుకాణం తెరిచేశాడు. విజయవాడలో నిన్న వెలుగుచూసిందీ ఘటన. నగరంలోని సత్యనారాయణపురం  గిరి వీధిలో ఓ వైద్యుడు ఒక్కో డోసుకు రూ. 600 వసూలు చేస్తూ కారులోనే టీకాలు వేస్తున్నాడు. విషయం తన దృష్టికి రావడంతో స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తి అక్కడికి చేరుకుని వైద్యుడిని నిలదీయడంతో కారుతో సహా అతడు అక్కడి నుంచి పరారయ్యాడు.

అప్రమత్తమైన కార్పొరేటర్ బైక్‌పై కారును వెంబడించారు. రామవరప్పాడు రింగ్ సెంటర్‌లో కారును ఆపి వైద్యుడిని పట్టుకున్నారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు కారును తనిఖీ చేశారు. అందులో టీకా వేయించుకున్న ముగ్గురు భీమవరం వ్యక్తులు కనిపించారు. అలాగే కొన్ని సూదులు, ఇంజక్షన్లు లభించాయి. కారులోని వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి వివరాలు సేకరించారు.

జి. కొండూరులో పనిచేసే ఓ వైద్యుడు తమతోపాటు మరికొందరికి టీకాలు వేసినట్టు వారు చెప్పారు. కారులో వ్యాక్సిన్లు కనిపించకపోవడం, ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు వారి ముగ్గురితో పాటు వైద్యుడిని కూడా వదిలిపెట్టేశారు.

ఒక వైపు ప్రజలు ప్రాణ భయం తో భయపడుతుంటే.. కొంత మంది వ్యక్తులు వాక్సిన్ తో ప్రజల ప్రాణాలతో బ్లాక్ దందా  చేస్తున్నారు. అసలు ప్రభుత్వాల దగ్గర లేని వాక్సిన్ వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది ప్రజలు ఆలోచిస్తూ ఆందోనళ పడుతున్నారు.