తిరుమల శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ. 4.30 కోట్లు

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపిస్తుండటంతో భక్తులు తిరుమలేశుని దర్శనం కోసం పోటెత్తుతున్నారు. శుక్రవారం (జూన్ 20) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ ఏటీజీహెచ్ వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయ పడుతోంది. ఇక గురువారం (జూన్ 19) శ్రీవారిని మొత్తం 70 వేల 226 మంది దర్శించుకున్నారు. వారిలో  31 వేల 960 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 30 లక్షల రూపాయలు వచ్చింది.