తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. బుధవారం (ఏప్రిల్ 17) ఉదయం శ్రీవారి దర్శనం కోసం నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం(ఏప్రిల్ 16) శ్రీవారిని 67 వేల 294 మంది దర్శించుకున్నారు.

వారిలో 22 వేల 765 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 94లక్షల రూపాయలు వచ్చింది.