తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
posted on Oct 24, 2025 9:37AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తిరుమలేశుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. శుక్రవారం (అక్టోబర్ 24) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లో 31 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (అక్టోబర్ 23) శ్రీవారిని మొత్తం 60వేల 896 మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 077 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 33ర
9:36 AM 10/24/2025 ` దడ లక్షల రూపాయలు వచ్చింది.