తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (జులై22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 30 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం (జులై21) శ్రీవారిని మొత్తం 75 వేల063 మంది దర్శించుకున్నారు.

వారిలో 26 వేల 956 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 99 లక్షల రూపాయలు వచ్చింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu