తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.  ఆదివారం(జూన్ 11) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి.

క్యూలైన్ బాట గంగమ్మ ఆలయం వరకూ సాగింది. టొకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.

కాగా శనివారం(జూన్ 10) 88 వేల 625 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.  51వేల 379 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.29 కోట్ల రూపాయలు వచ్చింది.