ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. ప్లాన్- B ఇదేనా..? ఈ రాత్రి పాక్ కు చుక్కలే..

 

భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. దిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, డిఫెన్స్ చీఫ్ అనిల్ చౌహాన్ తో పాటు త్రివిధ దళాల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత్- పాకిస్థాన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా వెల్లడించిన కొద్ది సేపటికే పాకిస్థాన్ తన దొంగ బుద్ధిని ప్రదర్శించింది. కాశ్మీర్, నాగ్రోటా ప్రాంతాల్లో మళ్లీ దాడులకు పాల్పడింది. దీంతో ఈ విషయాన్ని ప్రధాని మోదీ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ భేటీ కీలకం కానుంది. పాకిస్థాన్ ను మరోసారి నిలువరించాలన్న దానిపై త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ చర్చిస్తున్నారు. పాకిస్థాన్ పై మరోసారి కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఈ సమావేశం సాగుతోంది.

ప్రధాని నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ మీటింగ్ పై ఇప్పుడు యావత్ భారతావని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నమ్మించి మోసం చేసిన పాకిస్థాన్ కు మరోసారి దీటుగా సమాధానం చెప్పాలని నెటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు. యుద్ధాన్ని కొనసాగించాలని అంటున్నారు. దీంతో ప్రధాని మోదీ భేటీ కీలకం కానుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu