'టీ' బిల్లుపై 4 గంటల చర్చ ...

 

 

 

తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై ఎట్టకేలకు చివరి అంకానికి చేరుకుంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో బిజెపి నేత వెంకయ్యనాయుడుతో భేటీ అయిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా తెలంగాణా బిల్లుపై మద్దతు కోరారు. వెంకయ్యనాయుడు తాము సూచించిన సవరణలు చేస్తే తాము మద్దతుకు వ్యతిరేకం కాదని అన్నారు. అలాగే బిజెపి అగ్రనాయకులైన అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీతో కాంగ్రెస్ నాయకులు జైరామ్ రమేష్, షిండే కూడా సమావేశమయ్యారు. తెలంగాణా బిల్లుపై వారి మద్దతును కోరి సవరణలపై చర్చ కొనసాగించారు. రేపటి సమావేశాల్లో బడ్జెట్ పై చర్చ జరిగిన తరువాత తెలంగాణా బిల్లుపై చర్చకు 4 గంటల సమయాన్ని కేటాయించారు. పార్లమెంటు నుంచి వచ్చిన బిల్లును రాజ్యసభలో చర్చిందుకు 2 గంటల సమయాన్ని కేటాయించనున్నారని సమాచారం.