వేశ్యలపై కాదు.. రాజకీయ వ్యభిచారులపై కేసు పెట్టాలి..

సీపీఐ నారాయణ అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పుడు కూడా కేసీఆర్ పార్టీపై అలాంటి వ్యాఖ్యలే చేశారు. గతకొద్ది రోజుల నుండి తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లో వలసల పర్వం సాగుతోంది. తాజాగా టీడీపీ నేతలు కూడా వరుసపెట్టి టీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో దీనిపై నారాయణ స్పందిస్తూ కేసీఆర్ ను విమర్సించారు. అప్పట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్ష్ కింద వైఎస్. రాజశేఖర్ రెడ్డి తమ పార్టీలోకి ఆహ్వానించినప్పుడు గగ్గోలు పెట్టారు.. ఇప్పుడు టీడీపీ నేతలను ఎలా తమ పార్టీలోకి తీసుకుంటున్నారు అని అన్నారు. ఇలాంటి రాజకీయ వ్యభిచారులపై కేసులు పెట్టాలని నారాయణ డిమాండు చేశారు. రాజకీయ వ్యభిచారులపై కేసు పెట్టేంతవరకు వ్యభిచారం చేసే వేశ్యలపై కేసులు పెట్టకూడదని సిపిఐ నాయకుడు నారాయణ అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu