రెండేళ్లుగా గ్యాంగ్ రేప్..

ఆడవాళ్లపై అరాచకాలు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. రోజుకో ఉదంతం బయటకి వస్తున్న నేపథ్యంలో తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. తనపై సామూహిక అత్యాచారం చేస్తూన్నారంటూ ఒక ఉపాధ్యాయురాలు పోలీసులను ఆశ్రయించింది. వివరాల ప్రకారం.. ఫరీదాబాద్‌కి చెందిన ఓ మహిళా టీచర్.. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి, అతని సోదరులు, మరో వ్యక్తి కలిసి రెండేళ్లుగా తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారని తన తల్లిదండ్రులకు ఫోన్‌లో చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె తల్లి దండ్రులు వారి దగ్గరకి వెళ్లి చూడగా ఆమె పరిస్థితి అత్యంత దారుణంగా, విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతుండగా తాను కోల్కొంటే కానీ వాంగూల్మం తీసుకొని నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu