నెల్సన్ మండేలా మనవడిపై అత్యాచారం కేసు..

పండిత పుత్ర పరమ సుంట అన్న సామెత వినే ఉంటాం. ఇప్పుడు ఈ సామెత నెల్సన్ మండేలా మనవడికి బాగా వర్తిస్తుంది. నెల్సన్ మండేలా జాతి దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు. అలాంటి వ్యక్తికి మనువడైన ఎంబుసో మండేలా (24) అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యాడు. వివరాల ప్రకారం.. ఎంబుసో మండేలా జొహాన్నెస్బర్గ్ శివారల్లలోని గ్రీన్సైడ్ రెస్టారెంటులో 15 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. దీంతో ఎంబుసో మండేలాను పోలీసులు అరెస్టు చేశారు.  ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న అతడు బెయిల్ దరఖాస్తు పెట్టుకోగా దానిపై మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతుంది. కాగా నెల్సన్ మండేలాకు మొత్తం 17 మంది మనవలుండగా, వాళ్లలో ఒకడే ఈ ఎంబుసో.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu