చనిపోయిన ఎక్సైజ్ ఇనస్పెక్టర్ కి ముఖ్యమంత్రి బదిలీ..
posted on Jul 20, 2016 6:02PM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఓ ఎక్సైజ్ ఇనస్పెక్టర్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఆ బదిలీ విషయంలో విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదెంటీ బదిలీ చేస్తే విమర్శలు ఎందుకంటారా..? అక్కడే ఉంది ట్విస్ట్.. ఇంతకీ ఫడ్నవీస్ బదిలీ చేసింది ఎవరిననుకుంటున్నారా.. మూడేళ్ల క్రితం చనిపోయిన ఓ ఎక్సైజ్ ఇనస్పెక్టర్ని. అసలు సంగతేంటంటే.. సందీప్ మారుతి అనే ఎక్సైజ్ ఇనస్పెక్టర్ ను కోల్హాపూర్ నుంచి నాసిక్ కు ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్టు ఫడ్నవిస్ స్వయంగా సంతకం చేశారు. అయితే అతను చనిపోయినట్టు తెలుసుకున్న ముఖ్యమంత్రి పొరపాటుకు కారకునిగా గుర్తించిన ఓ క్లర్క్ ను సస్పెండ్ చేశారు. ఇక దీని గురించి తెలిసిన విపక్షాలు ఊరుకుంటాయా.. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని విపక్షాలు ఇప్పుడు పట్టుబడుతున్నాయి.