చుండూరు ఊచకోత నిందితులకు శిక్ష రద్దు చేసిన హైకోర్టు

 

 

 

గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో 1991లో జరిగిన దళితుల ఊచకోత కేసుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 21 మంది నిందితులకు కింది కోర్టు విధించిన శిక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా ఈ కేసులో 35 మందికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ కింది న్యాయస్థానాలు తీర్పు ఇచ్చాయి. ఈ శిక్షను కూడా రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుల కారణంగా చుండూరు గ్రామంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూడాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.