మార్కులు తక్కువ వచ్చాయన్నందుకు...

వామ్మో... రోజులు మరీ దారుణంగా మారిపోతున్నాయి. ఇటీవల కర్నాటకలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బెంగళూరులోని బసవశంకరి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే పద్మజ అనే మహిళ కుమార్తె ఇంటర్మీడియట్ పాస్ అయింది. అయితే ఆమెకు మార్కులు తక్కువ వచ్చాయి. దానికి పద్మజ తన కూతుర్ని మార్కులు తక్కువ వచ్చాయేంటని కోప్పడింది. దాంతో ఆ కూతురు కోపంతో రగిలిపోయింది. కిచెన్‌లోకి వెళ్ళి కత్తి తీసుకొచ్చి తన తల్లి మీద దాడి చేసింది. కత్తితో తల్లిని నాలుగుసార్లు పొడిచింది. కత్తిపోట్లకు గురైన తల్లి మరో కత్తిని తీసుకుని కూతురి మీద ఎదురుదాడి చేసి, తాను కూడా కత్తిపోట్లు పొడిచింది. కత్తిపోట్లకు తీవ్రంగా గురైన కుమార్తె అక్కడికక్కడే మరణించింది. ఇల్లంతా రక్తసిక్తమైపోయింది. కూతుర్ని చంపిన తర్వాత తల్లి కూడా కుప్పకూలిపోయింది. కూతురు చనిపోయింది. ఇప్పుడు తల్లి ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో వుంది.