వైకాపా దొంగలపార్టీ : ప్రచారంలో బాలకృష్ణ గర్జన

 

 శ్రీకాకుళం జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రచారం ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ ప్రచారంలో సింహ గర్జన చేస్తున్నారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌ల మీద ఘాటైన విమర్శలు చేస్తున్నారు. నిన్న శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు మీద ఘాటైన విమర్శలు చేసిన బాలకృష్ణ మంగళవారం నాడు జగన్ పార్టీని ఏకంగా దొంగలపార్టీ అని విమర్శించారు. జగన్ పార్టీ ప్రజలని ఇంకా దోచుకోవడానికే రాజకీయాల్లో వుందని అన్నారు. తెలుగుదేశం వ్యతిరేక పార్టీలను అణిచేస్తానని ఆయన చాలా స్ట్రాంగ్‌గా చెబుతున్నారు. అసలే ‘లెజెండ్’ విజయానందంలో వున్నాడేమో బాలకృష్ణ మహా ఆవేశంగా ప్రసంగిస్తున్నాడు. బాలకృష్ణ దూకుడు చూసి తెలుగుదేశం వర్గాలు మురిసిపోతున్నాయి.