చిరంజీవికి పోటీ భయం



 

అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి, పార్టీ పెట్టిన కొత్తల్లోనే సొంత ఊరికి దగ్గర్లో, అత్తవారి ఊళ్లోనే.. అదే పాలకొల్లులో ఓడిపోయిన చిరంజీవికి ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. అప్పట్లోనే, సొంత సామాజికవర్గం బలంగా ఉన్న చోట కూడా ఓ మహిళా అభ్యర్థి చేతిలో ఓడిపోయిన తాను ఇప్పుడు.. కాంగ్రెస్ పార్టీ మీద, అందులోనూ సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రుల మీద పీకల వరకు కోపం ఉన్న సీమాంధ్ర ప్రాంతంలో పోటీ చేసి నెగ్గగలనా అన్న అనుమానం కూడా గట్టిగానే ఉంది. దాంతో ప్రత్యామ్నాయం కోసం చూసుకుంటున్న చిరుకు.. కర్ణాటకలో తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే చిక్ బళ్లాపూర్ స్థానం కనిపించింది. బెంగళూరుకు సమీపంలోని చిక్ బళ్లాపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతారని అంటున్నారు. ఇక్కడ తెలుగు మాట్లాడే వారు ఎక్కువగా ఉండటంతో పాటు చిరంజీవికి చెప్పుకోదగ్గ సంఖ్యలో అభిమానులున్నారు. చిరంజీవికి కాస్తో కూస్తో విజయావకాశాలు ఉన్నాయంటే ఇక్కడే అంటున్నారు. ప్రస్తుతం ఈ స్థానానికి కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.