బెడిసికొట్టిన చిరు 'ఫిరాయింపుల' వ్యూహం

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీలో కొందరు ఎమ్మెల్యేల మాదిరి, చిరంజీవి పార్టీకి చెందిన శోభా నాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డిలు జై జగన్ అంటూ ఆయన వెంట తిరుగుతున్నా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరిపై పార్టీ ఫిరాయింపుల చట్టం వేటు వేయిద్దామని ప్రయత్నిస్తున్న చిరంజీవి వ్యూహం బెడిసికొట్టింది. చిరంజీవి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసేలోపే వారే ఎదురుదాడి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం చేయాలనే నిర్ణయం తమకు ఇష్టం లేకుండా జరుగుతుందంటూ ఆ లేఖలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు కాకపోయినా మున్ముందు పార్టీ ఫిరాయింపుల చట్టం వల్ల ఇబ్బందులు తప్పవని భావిస్తున్న వారు ఇప్పటికే తమ లాయర్లను రంగంలోకి దింపారు. తమకు ఇష్టం లేకుండా కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం అవుతున్న తరుణంలో ఆ చట్టం తమకు వర్తిస్తుందా? లేదా? ఒకవేళ వర్తిస్తే ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? అనే దానిపై కసరత్తు మొదలుపెట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu